హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెరువులో శవమై తేలిన ఐదో తరగతి విద్యార్థి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఇంటి నుంచి పాఠశాలకని బయలుదేరిన విద్యార్థి చెరువులో శవమై తేలాడు. విశాల్ అనే ఐదో తరగతి విద్యార్థి శవం శుక్రవారం ఉదయం హైదరాబాదులోని మీర్‌పేట చెరువులో తేలింది. శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు కనిపించకుండా పోయిన విశాల్ ఐదు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత రెండు రోజుల క్రితం పాఠశాలకని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.

తన కుమారుడు కనిపించకపోవడంతో విశాల్ తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో ఎవరో మునుగుతున్నట్లున్నారని స్థానికులు చెప్పడంతో పోలీసులు గురువారం చెరువులో గాలించారు. కానీ ఫలితం కనిపించలేదు. అయితే, శుక్రవారం ఉదయం విశాల్ శవం చెరువులో తేలడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. శవంతో తమ వద్ద ఉన్న ఫొటోను సరిపోల్చి విశాల్ తల్లిదండ్రులను పిలిపించారు.

విశాల్ ఎస్ఆర్‌డిజి స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఏదో భయం కారణంగానే విశాల్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బహుశా, చదువుపై భయంతో అతను ఈ దారుణాన్ని ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. విశాల్ చదువుపై వారు పాఠశాల టీచర్లను కూడా అడిగి తెలుసుకుంటున్నారు.

విశాల్ మృతి మిస్టరీగానే కనిపిస్తున్నప్పటికీ భయం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు గురువారం అందించిన సమాచారాన్ని బట్టి కూడా వారు అదే నిర్ధారణకు వస్తున్నారు.

English summary
A fifth class student Vishal has died drowning into Meerpet water pond in Hyderabad. He was went to school from the house two days back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X