వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌహతి దాష్టీకం: కోల్‌కత్తా వద్ద ప్రధాన నిందితుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kalita
గౌహతి: అస్సాంలోని గౌహతి దాష్టీకం కేసులో ప్రధాన నిందితుడు కోల్‌కత్తా సమీపంలో తల దాచుకున్నట్లు పోలీసులు కనిపెట్టారు. పబ్ సమీపంలో యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన 30 మందికి నాయకత్వం వహించినట్లు భావిస్తున్న ప్రధాన నిందితుడి ఫొటోలను పోలీసులు స్థానిక చానెళ్లలో ప్రసారమయ్యేలా చూశారు. అతన్ని పట్టిచ్చినవారికి రివార్డును కూడా ప్రకటించారు.

కేసులో ప్రధాన నిందితుడు అమర్ జ్యోతి కలిత జులై 9వ తేదీ నుంచి పరారీలో ఉన్నాడు. దాష్టీకం జరిగిన సమయంలో టీ షర్ట్ ధరించి, గుంపును రెచ్చగొడుతూ కనిపించాడు. కలిత ముంబైలో ఉన్నాడని, పోలీసులు పట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి గతవారం చెప్పారు. సంఘటనను చిత్రీకరించిన స్థానిక టీవీ చానెల్ రిపోర్టర్ గౌరవ్ జ్యోతి నియోగ్‌ను పోలీసులు గతవారం అరెస్టు చేశారు.

నియోగ్ కలితకు సన్నిహిత మిత్రుడని పోలీసులు చెబుతున్నారు. మహిళపై అత్యాచారానికి వారిద్దరు గుంపును రెచ్చగొట్టారని పోలీసులు అంటున్నారు. దాడి చేస్తున్న గుంపును అడ్డుకోలేమని భావించిన తమ రిపోర్టర్లు, సాక్ష్యం దొరుకుతుందనే ఉద్దేశంతో సంఘటనను చిత్రీకరించారని న్యూస్ లైవ్ ప్రతినిధులు అంటున్నారు.

కలిత తనను తాను జేమ్స్ బాండ్‌గా ఫేస్‌బుక్‌లో చెప్పుకున్నాడు. సంఘటన జరిగినప్పుడు వేసుకున్న ఎర్ర రంగు చొక్కానే సంఘటన జరిగినప్పుడు ధరించాడని చెబుతున్నారు. ఆచూకీని కనిపెట్టిన పోలీసులు కలితను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary
The man who led a mob of 30 people as it molested a young woman, on camera, outside a pub in Guwahati, has been traced to a location near Kolkata. The police will flash his photo on local channels and offer a reward for any information that leads to his arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X