వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయా విగ్రహం ధ్వంసం: రిపేర్ చేయించిన అఖిలేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

UP: Akhilesh repairs beheaded Mayawati's statue overnight
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి విగ్రహ ధ్వంసంపై ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెంటనే స్పందించారు. మాయావతి మార్బుల్ విగ్రహం ధ్వంసమైందని తెలియగానే ఆగమేఘాల మీద దానిని అఖిలేష్ బాగు చేయించారు. గురువారం ముగ్గురు వ్యక్తులు లక్నోలోని కాశీరాం గార్డెన్స్‌లోని మాయావతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అఖిలేష్ దానిని రాత్రికి రాత్రే బాగు చేయించారు.

మాయా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముగ్గురిని కూడా పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. నిందితులు ఉత్తరప్రదశ్ నవనిర్మాణ సేన కార్యకర్తలుగా భావిస్తున్నారు. నవ నిర్మాణ సేనకు సంబంధించిన పాంప్లెట్లు సంఘటనా స్థలంలో పోలీసులు కనుగొన్నారు. అయితే పాంప్లెట్లలో ఉన్న వివరాల ప్రకారం ఆ సంస్థ కార్యకర్తలు మార్చి 15, 2012లో మాయావతి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు.

మాయావతి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉత్తర ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బిఎస్పీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యుపిలోని ఝాన్సీ, అంబేద్కర్ నగర్, ముజఫర్ నగర్, కాన్పూర్ సహా పలు చోట్ల బిఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బిఎస్పీ అఖిలేష్‌ను టార్గెట్ చేసింది. దీంతో ముఖ్యమంత్రి అఖిలేష్ వెంటనే స్పందించి మాయావతి విగ్రహాన్ని బాగు చేయించడం గమనార్హం.

English summary
Uttar Pradesh Chief Minister and Samajwadi Party leader, Akhilesh Yadav did not waste any time to take action against those who vandalised Mayawati's statue. The CM issued prompt order and the statue has been repaired overnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X