బాలయ్య పోటీ చేస్తే ఎన్టీఆర్ లాగే ఉంటుంది: చమన్

శనివారంనాడు ఆయన తన సొంత జిల్లా అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. గ్రూపు రాజకీయాలు అలవాటు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిర్ణయం మేరకే తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చమన్ చెప్పారు.
పరిటాల రవి హత్య తరువాత తొలిసారిగా చమన్ అనంతపురం వచ్చారు. పరిటాల రవి తనకు అన్నలాంటివాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో చమన్ రాజకీయ భవిష్యత్తుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆయన పరిటాల రవి సతీమణి, శాసనసభ్యురాలు పరిటాల సునీతతో కలిసి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఆ చర్చకు తెర పడింది.
చమన్ తెలుగుదేశం పార్టీలోనే అనంతపురం జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసే ఉద్దేశంతో కూడా ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ముఠా రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని ఆయన చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications