అన్నా దీక్ష ప్రారంభం: కేంద్రం సిబిఐని పావుగా... కిరణ్

2014 ఎన్నికల నాటికి కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అన్నారు. తనకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదని, ఎన్నికలలో కూడా పోటీ చేయబోనని మరోసారి చెప్పారు. తన టీమ్ సభ్యులు తన ఆరోగ్యం దృష్ట్యా దీక్ష చేపట్ట వద్దని సూచించిందని, అయితే నాలుగు వందల మంది ప్రజలు దీక్షకు దిగారని, వారిని వదిలేసి తాను దీక్ష చేపట్ట కుండా ఉండలేక పోయానన్నారు.
శనివారం కూడా తన టీమ్ సభ్యులు దీక్ష మానుకోవాలని సూచించారన్నారు. తనకు ప్రజల మద్దతుందన్నారు. తాను జన్ లోక్పాల్ బిల్లు తెచ్చే వరకు పోరాటం చేస్తానని, ఈ దేశ ప్రజలు తనను చావనివ్వరన్నారు. దీక్ష ప్రారంభం సందర్భంగా హజారే భారత్ మాతాకీ జై, వందే మాతరమ్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించారు.
లోకపాల్ బిల్లు పరిధిలోకి సిబిఐని తీసుకు రావాల్సి ఉందని కిరణ్ బేడీ అన్నారు. కేంద్రం సిబిఐను తమ పావుగా ఉపయోగించుకుంటోందని, జన్ లోక్పాల్ బిల్లు వచ్చి, దాని పరిధిలోకి సిబిఐ వస్తే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందన్నారు. కాగా అన్నా మరో ముగ్గురు తమ టీమ్ సభ్యులతో కలిసి దీక్షను చేపట్టారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications