హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు 14వరకు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసు, ఎమ్మార్ కేసులలోని నిందితులను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి, వారందరికీ ఈ నెల 14వ తేది వరకు రిమాండ్ పొడిగించింది.

ఈ మూడు కేసులలో అరెస్టైన జగన్‌ను, నిమ్మగడ్డ ప్రసాద్‌ను, మోపిదేవి వెంకటరమణను, గాలి జనార్ధన్ రెడ్డిని, విజయ రాఘవను తదితరులను కోర్టు విచారించింది. ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మీ మాత్రమే కోర్టు విచారించలేదు. మిగిలిన అందరినీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి 14 వరకు రిమాండును పొడిగించింది.

కాగా జగన్ గత మే 27వ తేదిన అరెస్టయిన విషయం తెలిసిందే. గాలి గత సంవత్సరం అరెస్టయ్యారు. అప్పటి నుండి ఈ కేసులలో వరుసగా నిందితులు అరెస్టవుతున్నారు. ఈ మూడు కేసులలోనూ సిబిఐ ఇప్పటికే కోర్టులో పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది.

జగన్ ఆస్తుల కేసులో మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసిన సిబిఐ మరో పది దాఖలు చేయనుంది. అక్రమాస్తుల కేసులోని ప్రతి ఛార్జీషీటులోను ఎ-1గా జగన్‌ను, ఎ-2గా విజయ సాయి రెడ్డిని సిబిఐ నిందితులుగా పేర్కొంటోంది. తదుపరి ఛార్జీషీట్లలో కూడా అలాగే పేర్కోనుంది.

English summary
A local CBI court today extended till August 14 the judicial remand of YSR Congress chief Y S Jaganmohan Reddy in connection with a disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X