రంజితతో కల్సి నిత్యానంద: విదేశాలకు చెక్కేసే యత్నం
రంజితతో కలిసి నిత్యానంద నేపాల్ మీదుగా విదేశాలకు తప్పించుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిత్యానంద ప్రస్తుతం రంజితతో కలిసి మానస సరోవర యాత్రలో ఉన్నారు. ఆ యాత్ర అనంతరం అటు నుండి నేరుగా నేపాల్ వెళ్లేందుకు నిత్యానంద, రంజితలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మానస సరోవర యాత్ర నుండి తిరిగి రాగానే నిత్యానందను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
నిత్యానంద గత పదిహేను రోజులుగా తప్పించుకు తిరుగుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్ష చేసేందుకు సహకరించడం లేదు. మరోవైపు కోర్టు కూడా అతనికి బెయిల్ నిరాకరించింది. దీంతో ఏ క్షణంలోనైనా పోలీసులు అతనికి అరెస్టు వారెంట్ జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉంటే మరిన్ని అక్కట్లు వస్తాయని భావించిన నిత్యానంద విదేశాలకు చెక్కేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
రంజితతో పాటు మరో ముప్పై మంది శిష్యులతో అతను ప్రస్తుతం హిమాలయాలలో ఉన్నాడు. హిమాలయాలలో ఉన్న నిత్యానంద ట్రావెల్ ఏజెట్ల ద్వారా తన మిగిలిన శిష్యుల పాసుపోర్టులను వెనక్కి పంపించాడు. కేవలం శిష్యులను తిరిగి వెనక్కి పంపించి అతను రంజితతో పాటు నేపాల్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడట.