లాలూచీ ఎఫెక్టా: బెయిల్ అడగవద్దని జగన్ నిర్ణయం

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నికలలో బెయిల్ అడగవద్దని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. గత నెల 19న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల కోసం జగన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఓటు వేసేందుకు ఓకే చెప్పడంతో జగన్ కోర్టుకు వెళ్లి ఓటు వేసేందుకు అనుమతి కోరారు.

ఆయన విజ్ఞప్తిని మన్నించిన కోర్టు ఓటేసేందుకు అనుమతించింది. దీంతో అతను రాష్ట్రపతి ఎన్నికలలో యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారు. అయితే రేపు జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలలో మాత్రం ఓటు వేసేందుకు బెయిల్‌ను అడగ వద్దని జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇందుకు పలు రకాల కారణాలు ఉండవచ్చునని చెబుతున్నారు. ప్రణబ్‌కు వోటు వేసిన తర్వాత జగన్ పార్టీపై తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేసింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారని, ఇరువురి మధ్య ఒప్పందం ఓట్ ఫర్ బెయిల్ ఒప్పందం జరిగిందని, అందులో భాగంగానే జగన్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేశారని, అప్పటి నుండే జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దర్యాఫ్తులో వేగం కూడా తగ్గిందని టిడిపి ఆరోపిస్తోంది.

ఇన్నాళ్లూ జగన్ పార్టీ టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కు అని ఆరోపించేది. అయితే రాష్ట్రపతి ఎన్నికల తర్వాత లాలూచీ అంశం తమకే ఎదురు తిరగడంతో జగన్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని అంటున్నారు. ఈ కారణంగానే లాలూచీ వ్యాఖ్యలను గట్టిగా తిప్పి కొట్టేందుకే జగన్ ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు కోర్టును కోరవద్దని నిర్ణయించుకున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+