హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఉప్పల్‌లో అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రమీల సోమవారం విగత జీవిగా కనిపించింది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ సమీపంలోని కందిమళ్లలో ఆమె మృతదేహం పోలీసులు ఉదయం కనుగొన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రమీల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె ఉప్పల్‌లో అదృశ్యమైంది.

దీంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉదయం ఆమె శవాన్ని నల్గొండ జిల్లాలో గుర్తించారు. ఆమె మృతదేహం కాల్చి పడేసి ఉంది. దీంతో ఎవరైనా ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వివాదమే ప్రమీల హత్యకు కారణం కావొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. బోడుప్పల్‌లోని ఓ భూమికి సంబంధించి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

ప్రమీల స్వస్థలం ప్రకాశం జిల్లా పోకూరు గ్రామం. ప్రమీల భర్త నాగేశ్వర రావు ఆడిటర్‌గా పని చేస్తున్నారు. హబ్సిగూడలోని శ్రీ సాయి అపార్టుమెంటులో ప్రమీల రియల్ ఎస్టేట్, చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. ఈమె మృతిపై బంధువులు గతంలో రూ.10 లక్షలు ఆమె నుండి అప్పుగా తీసుకున్న ఓ వ్యక్తిని అనుమానిస్తున్నారు. అతనే ఆమెను హత్య చేసి ఉంటారని అంటున్నారు.

దొంగల అరెస్ట్

తూర్పు గోదావరి జిల్లాలోని ఎలూరులో ఎనిమిది మంది దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి నాలుగు కిలోల బంగారం, నలభై కిలోల వెండి, 3 ఎల్‌సిడిలు, ఓ కారు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సిద్దిపేటలో బైక్ దొంగలు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 11 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో కూడా ముగ్గురు వ్యక్తులను అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకు అరెస్టు చేశారు.

English summary
Unknown persons killed real estate business woman. Police found Pramila's dead body at Choutuppal of Nalgonda district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X