బాబు పెద్ద మాదిగ: మోత్కుపల్లి, మందకృష్ణ సత్కారం

తెలుగుదేశం పార్టీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, దీనివల్ల దళితుల్లోని అన్ని ఉప కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు మిగిలిన పార్టీలూ టిడిపిని స్ఫూర్తిగా తీసుకోవాలని, లేకపోతే దళితులు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని, తెలంగాణ విషయంలోనూ చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకొంటే ఈ ప్రాంతంలో ఆయన ఘన విజయం సాధిస్తారని ఆయన అన్నారు. సామాజిక న్యాయ కోణంలో స్వాతంత్య్ర ఫలాలు జనాభా ప్రాతిపదికన అందరికీ అందాలన్న ఉద్దేశంతోనే వర్గీకరణకు అనుకూలం నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు.
"అణగారిన వర్గాలకోసం మందకృష్ణ 18 ఏళ్లుగా పనిచేస్తున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణను అమలు చేయడంవల్ల విద్య ఉద్యోగాల్లో వేలాది మాదిగలకు న్యాయం జరిగింది. సామాజిక న్యాయ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నది టిడిపి ఒక్కటే'' అని ఆయన స్పష్టంచేశారు. వర్గీకరణపైనిర్ణ యంతో చంద్రబాబు ఇప్పుడు 'మాదిగల్లో పెద్ద మాదిగ' అని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు అభివర్ణించారు. "చంద్రబాబుకు మాదిగలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. ఆ విషయంలో వెనకడుగేస్తే భవిష్యత్తు లో వారిగురించి మాట్లాడే నాథుడే ఉండడు'' అ ని హెచ్చరించారు.
కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు కడియం శ్రీహరి, పట్నం సుబ్బయ్య, శమంతకమణి, డి.శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉస్మానియా వర్సిటీ జేఏసీ నేత దరువు ఎల్లన్న ఆధ్వర్యంలో వందమంది ఓయూ దళిత విద్యార్థులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపా రు. మందా మోహన్, కిరణ్, రాజేందర్, సురేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఆ సంఘం రాష్ట్ర నేతలు చంద్రబాబుకు డప్పు బహూకరించారు. కాగా, ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నవంబర్ 10న ధర్నా నిర్వహిస్తామని పేరుపోగు ప్రకటించారు. తెలంగాణ మాదిగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటికాయల జయరాం ఆధ్వర్యంలో పలువురు నేతలు ధన్యవాదాలు తెలిపారు. మహామాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు దేవయ్య మాదిగ నేతలతో వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications