దాడుల రూమర్స్: ఈశాన్యవాసులకు ఆర్ఎస్ఎస్ అండ

సుమారు 250 మందికి పైగా స్వయం సేవకులు(ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు) బెంగళూరు రైల్వే స్టేషన్లలో తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఈశాన్య రాష్ట్ర వాసులకు రక్షణపై హామీ ఇస్తున్నారు. దాడుల ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్, విహెచ్పి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొట్టి పారేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కర్నాటక ప్రాంత శారీరక్ ప్రముఖ్ చంద్రశేఖర్ జాగీదర్, నగర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ రాయ్ల ఆధ్వర్యంలో స్వయం సేవకులు బెంగళూరులోని మెజిస్టెక్ రైల్వే స్టేషన్లో ఈశాన్య రాష్ట్రవాసులతో మాట్లాడుతూ రక్షణపై హామీ ఇస్తున్నారు.
కాగా అస్సాం అల్లర్ల ప్రభావం బెంగళూరులో ఉన్న ఈశాన్య రాష్ట్ర వాసులపై పడింది. అక్కడి అల్లర్ల కారణంతో బెంగళూరు ప్రాంతంలోని ఈశాన్య రాష్ట్రాల వారిపై పెద్ద ఎత్తున దాడులు జరగబోతున్నాయన్న ప్రచారం వారిలో భయాందోళన కలిగించింది. దీంతో వారు పెట్టే బేడా సర్దుకొని బెంగళూరు నుండి తరలి పోతున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రకటనలు చేసినప్పటికీ వారు మాత్రం వెళ్లేందుకే సిద్ధపడ్డారు.
సుమారు ఐదు వేల మంది ఈశాన్య రాష్ట్రాల వాళ్లు బెంగళూరు, ఆ పరిసరాల నుండి తరలి వెళ్లారు/వెళుతున్నారు. ఇలా వెళుతున్న వారిలో విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, ఇతర వృత్తుల వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు మూడు నుండి నాలుగు వేల మంది ఇప్పటికే బుధవారమే వెళ్లారని భావిస్తున్నారు. దాడులు చేస్తామని బాధితులకు పెద్ద ఎత్తున ఎస్సెమ్మెస్లు రావడంతో వారు వెళ్లి పోవడం ప్రారంభించారు.
ఇవన్నీ వదంతులేనని భయపడాల్సిన పని లేదని కర్నాటక హోమంత్రి, డిజిపి ప్రకటించారు. ఈ విషయమై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రి షెట్టార్, కేంద్రహోంమంత్రి షిండేతో మాట్లాడారు. వారికి రక్షణపై హామీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల వారు వెళుతుండటంతో రైల్వే స్టేషన్లు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అందుబాటులో ఉన్న రైళ్లలో వెళుతున్నారు. ఈ విషయమై షెట్టార్ పిటిఐతో మాట్లాడుతూ... ప్రధాని, హోంమంత్రి ఈశాన్య రాష్ట్రవాసులు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని చెప్పారన్నారు.
వారికి ఎలాంటి అపాయం జరగదని, తమ ప్రభుత్వం వారికి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కూడా తనతో మాట్లాడారని, ఆయనకు తాను హామీ ఇచ్చానని చెప్పారు. కాగా ప్రయాణీకుల తాకిడి ఎక్కువ కావడం, వారి డిమాండ్ చేయడంతో రైల్వే అధికారుల ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల వాసులు తరలి పోవడంపై ముఖ్యమంత్రి షెట్టార్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications