బాబుకు వైయస్ విజయమ్మ లేఖ: టిడిపిపై బాజిరెడ్డి ఫైర్

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయమ్మ లేఖపై టిడిపి నేతలు స్పందించిన తీరు గుమ్మడి కాయల దొంగఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బిసిల వల్ల చంద్రబాబు లబ్ధి పొందారే కానీ, ఆయన వల్ల బిసిలు ఎన్నడూ లబ్ధి పొందలేదని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాటలు, మాయలతో జనాన్ని మోసం చేసి, అధికారం కోల్పోయాక డిక్లరేషన్ ప్రకటిస్తే ఎవరు నమ్ముతారని, ఇది బిసిలను మరోసారి మోసం చేసే డ్రామా అని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్, ఇతర పార్టీలకు నిజాయితీ ఉంటే అసెంబ్లీలో బిసిలకు వంద స్థానాలు కల్పించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తమ పార్టీ ఈనెల 24న బిసి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల వైయస్ విజయమ్మ బిసిలకు అసెంబ్లీలో వంద స్థానాలు కేటాయిస్తామని చంద్రబాబుకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications