వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొదటి భార్యను, బిడ్డను ముక్కలుగా కోసిన భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

Bihar Map
నలంద: బీహార్ రాష్ట్రంలో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. రెండో పెళ్లిని కాపాడుకోవడానికి అతను తన మొదటి భార్యను, కూతురిని ముక్కలుగా నరికాడు. అంతేకాదు, వారి శరీరం ముక్కలను ఉంచి ఇంటి గోడ కట్టాడు. అతనికి తండ్రి, తల్లి, రెండో భార్య సహకరించారు.

బీహార్‌లోని నలంద జిల్లా నగరనౌషా పోలీసు స్టేషన్‌ పరిధిలోని పరదీహ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గోడను పోలీసులు పగులగొట్టడంతో సంఘటన వెలుగు చూసింది. కొత్తగా కట్టిన గోడను కూల్చేసి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని ఖాళీగా పెట్టారు.

ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారంనాడు రంగంలోకి దిగారు. మృతులను యోగేశ్వర్ ప్రసాద్ భార్య సుమిత్రా దేవి, కూతురు నిధిగా గుర్తించారు. యోగేశ్వర్‌ను, అతని భార్యను భగ్వాన్‌పూర్‌లో అరెస్టు చేసినట్లు నలంద ఎస్పీ నిషాంత్ కుమార్ తివారీ చెప్పారు.

యోగేశ్వర్ తండ్రి కిషన్ సోవాను, తల్లి రాజకుమారి దేవిని భదోహ్ గ్రామంలో అరెస్టు చేశారు. తన భార్యను, కూతురిని ఆగస్టు 17వ తేదీన హత్య చేసినట్లు యోగేశ్వర్ పోలీసుల వద్ద అంగీకరించాడు. రెండో భార్య విషయంపై గొడవ పడిన తర్వాత తాను పని చేసినట్లు అతను చెప్పాడు. హత్యలు చేయడానికి వాడిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
To save his second marriage, a man killed his first wife and their minor daughter, cut the bodies into pieces and concealed them inside a wall at his house with the help of his father, mother and second wife. The incident took place at Parasdeeh village under the Nagarnausa police station in Nalanda district on August 17, but the perpetrators could be arrested on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X