మొదటి భార్యను, బిడ్డను ముక్కలుగా కోసిన భర్త
బీహార్లోని నలంద జిల్లా నగరనౌషా పోలీసు స్టేషన్ పరిధిలోని పరదీహ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గోడను పోలీసులు పగులగొట్టడంతో సంఘటన వెలుగు చూసింది. కొత్తగా కట్టిన గోడను కూల్చేసి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని ఖాళీగా పెట్టారు.
ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారంనాడు రంగంలోకి దిగారు. మృతులను యోగేశ్వర్ ప్రసాద్ భార్య సుమిత్రా దేవి, కూతురు నిధిగా గుర్తించారు. యోగేశ్వర్ను, అతని భార్యను భగ్వాన్పూర్లో అరెస్టు చేసినట్లు నలంద ఎస్పీ నిషాంత్ కుమార్ తివారీ చెప్పారు.
యోగేశ్వర్ తండ్రి కిషన్ సోవాను, తల్లి రాజకుమారి దేవిని భదోహ్ గ్రామంలో అరెస్టు చేశారు. తన భార్యను, కూతురిని ఆగస్టు 17వ తేదీన హత్య చేసినట్లు యోగేశ్వర్ పోలీసుల వద్ద అంగీకరించాడు. రెండో భార్య విషయంపై గొడవ పడిన తర్వాత తాను పని చేసినట్లు అతను చెప్పాడు. హత్యలు చేయడానికి వాడిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.