ఏం జరుగుతోంది: కిరణ్ రెడ్డికి అర్ధరాత్రి అహ్మద్ పిలుపు
అదే సమయంలో అహ్మద్ పటేల్ నుండి కిరణ్కు పిలుపు వచ్చింది. త్వరగా రండి... మాట్లాడుకుందామని పటేల్ చెప్పడంతో అర్ధరాత్రి 12.30 గంటలకు కిరణ్ తన అతిథి గృహం నుంచి హుటాహుటిన అహ్మద్ పటేల్ వద్దకు బయలుదేరారు. వారిద్దరి మధ్య భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది మాత్రం తెలియరాలేదు. అయితే అర్ధరాత్రి పూట పిలిచి మాట్లాడటంపై కాంగ్రెసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
వారిద్దరి మధ్య ఏం చర్చకు వచ్చింది? ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? చిరంజీవికి రాష్ట్రంలో ముఖ్య పదవులు అప్పగించే అవకాశముందా? అందుకే కిరణ్ను ఒప్పించేందుకు పిలిచారా? అనే అనుమానాలు అటు రాజకీయవర్గాల్లో ఇటు సామాన్యులలో తలెత్తుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి మార్పు అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఒకవైపు ధర్మాన రాజీనామా వ్యవహారం, మరోవైపు నాయకత్వ మార్పులపై ఊహాగానాల నేపథ్యంలో... కిరణ్కు అర్ధరాత్రి అనూహ్యంగా మరోసారి అహ్మద్ పటేల్ నుంచి పిలుపు అందడం గమనార్హం.