వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం జరుగుతోంది: కిరణ్‌ రెడ్డికి అర్ధరాత్రి అహ్మద్ పిలుపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ నుండి అర్ధరాత్రి పూట పిలుపు రావడం కాంగ్రెసు పార్టీలో చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం న్యూఢిల్లీ వెళ్లిన కిరణ్ రోజంతా బిజీ బిజీగా గడిపారు. రాత్రి వరకు వరుస భేటీలతో బిజీ అయ్యారు. ఆ తర్వాత రాత్రి ఎపి భవన్‌లో పార్టీ నేతలతో కలిసి భోజనం చేసి... కాసేపు విశ్రాంతి తీసుకొని, నిద్రకు ఉపక్రమించారు.

అదే సమయంలో అహ్మద్ పటేల్ నుండి కిరణ్‌కు పిలుపు వచ్చింది. త్వరగా రండి... మాట్లాడుకుందామని పటేల్ చెప్పడంతో అర్ధరాత్రి 12.30 గంటలకు కిరణ్ తన అతిథి గృహం నుంచి హుటాహుటిన అహ్మద్ పటేల్ వద్దకు బయలుదేరారు. వారిద్దరి మధ్య భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది మాత్రం తెలియరాలేదు. అయితే అర్ధరాత్రి పూట పిలిచి మాట్లాడటంపై కాంగ్రెసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

వారిద్దరి మధ్య ఏం చర్చకు వచ్చింది? ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? చిరంజీవికి రాష్ట్రంలో ముఖ్య పదవులు అప్పగించే అవకాశముందా? అందుకే కిరణ్‌ను ఒప్పించేందుకు పిలిచారా? అనే అనుమానాలు అటు రాజకీయవర్గాల్లో ఇటు సామాన్యులలో తలెత్తుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి మార్పు అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఒకవైపు ధర్మాన రాజీనామా వ్యవహారం, మరోవైపు నాయకత్వ మార్పులపై ఊహాగానాల నేపథ్యంలో... కిరణ్‌కు అర్ధరాత్రి అనూహ్యంగా మరోసారి అహ్మద్ పటేల్ నుంచి పిలుపు అందడం గమనార్హం.

English summary
CM Kiran Kumar Reddy received a call from Ahmed Patel at late night on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X