ప్రధాని, సోనియా ఇళ్ల ముట్టడి యత్నం: కేజ్రీవాల్ అరెస్ట్
అనంతరం ర్యాలీగా ప్రధాని నివాసం వైపు వెళ్లారు. బారీకేడ్లు దాటుకొని పార్లమంటు భవనం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పార్లమెంటు స్ట్రీట్లో ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్ను, ప్రశాంత్ భూషణ్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వదిలి పెట్టారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. అవినీతిలో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష బిజెపి రెండు సమానమేనని అని ఆరోపించారు. రాజకీయాల పేరుతో వ్యాపారం నడుపుతున్న వారి పేర్లను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోసారి ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన కేజ్రీవాల్ను పోలీసులు రెండోసారి అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ బృందం నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగాయి. మరోవైపు భారీ ఎత్తున మహిళా ఆందోళనకారులు సోనియా నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. సోనియా, మన్మోహన్, గడ్కరీ నివాసాల వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.