వైయస్ చాపర్: కో-పైలట్ ఫ్యామిలీ ఆవేదన, జగన్పైనా

2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్తో పాటు మరణించిన కో పైలట్ ఎంఎస్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ ప్రమాదం జరిగి మూడేళ్లు పూర్తవుతున్నా కుటుంబంలో ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదని, ఇతరత్రా సాయం కూడా ఏమీ చేయలేదని విమర్శించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లల చదువుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాటి మృతుల్లో సెక్యూరిటీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించిన జాన్వెస్లీ, ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణం కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని అన్నారు.
మరి తన సోదరుడి విషయంలో ఇలా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులను కలిసినప్పుడు ఇంకా సాయం అందలేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. హెలికాప్టర్ ప్రమాదం విషయం తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు తమ ఇంటికి వచ్చి, ఆ కుటుంబాన్ని పరామర్శించి చేదోడువాదోడుగా ఉంటామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారని జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు.
వైయస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారందరినీ ఓదార్చేందుకు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేశారని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సహకారం కూడా అందించారని గుర్తు చేశారు. మరి ఎంఎస్ రెడ్డి కుటుంబాన్ని ఆయన ఎందుకు ఓదార్చలేదని ప్రశ్నించారు. ఆర్మీలో పైలట్గా చేరిన ఎంఎస్ రెడ్డి సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తించి లెఫ్టినెంట్ కర్నల్గా వివిఐపిలకు విశేష సేవలు అందించారన్నారు.
సొంత రాష్ట్రానికి వచ్చి పిల్లలతో గడపాలనుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్కు ఆయన సేవలు అవసరమని ఇక్కడకు రప్పించినట్లు తెలిపారు. ఇప్పుడు తమ కుటుంబం వారికి అండగా ఉండటంతో పిల్లలు చదువుకుంటున్నారని, లేనిపక్షంలో వారు రోడ్డున పడేవారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇకనైనా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications