ఇరాక్లో పేలుళ్లు, 73మంది హతం: ఉపాధ్యక్షుడికి ఉరి
మృతి చెందిన వారిలో పలువురు సైనికులు కూడా ఉన్నారు. ఫ్రాన్స్ దౌత్య కార్యాలయం వద్ద కారు బాంబు దాడిలో గార్డు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. అమర పట్టణంలో దాడులు, కాల్పుల్లో 16 మంది మృతి చెందగా చాలామంది గాయపడ్డారు. దుజైల్లో శనివారం అర్ధరాత్రి సైనిక శిబిరంపై జరిగిన దాడిలో 10 మంది సైనికులు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ఆదివారం కిర్కుక్లోని చమురు సంస్థ వద్ద కారు బాంబు దాడిలో పలువురు మృతి చెందారు. కిర్కుర్లో కారు, మోటారు, సైకిల్ బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, నలభై మందికి పైగా గాయపడ్డారు. సమర్రా, బస్రా తదితర నగరాలలో చేసిన దాడులలోనూ పలువురు మృతి చెందారు. ఇరాక్లోని అలై ఖైదా అనుబంధ సంస్థ ఈ దాడులకు పాల్పడింది.
ఇరాక్ ఉపాధ్యక్షుడికి ఉరి శిక్ష
కాగా పరారీలో ఉన్న ఇరాక్ ఉపాధ్యక్షుడు తారీక్ అల్ హషేమికి ఉరిశిక్ష విధిస్తూ బాగ్దాద్లోని ఓ న్యాయస్థానం ఆదివారం తీర్పు చెప్పింది. ఇదే సమయంలో తారీక్ కార్యదర్శి, అతని అల్లుడు అహ్మద్ ఖతన్కు కూడా బాగ్దాద్లోని మరో కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒక లాయర్, మరో బ్రిగేడియర్ జనరల్ హత్య కేసులో హషేమీపై విచారణ సాగుతోంది. ఈ ఆరోపణల నేపథ్యం లో ఈ ఏడాది ఆరంభంలో ఆయన విదేశాలకు పారిపోయారు.