వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై ఉప్పులేటి ఫైర్: పొత్తులేదు.. విజయ చందర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uppuleti Kalpana
విజయవాడ: రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉన్న ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నేత విజయ చందర్ బుధవారం అన్నారు. కాంగ్రెసులో తమ పార్టీ విలీనం అవుతుందనే వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆదరణ చూరగొంటున్న తమ పార్టీ ఎందులోనూ విలీనం కాదని చెప్పారు. భవిష్యత్తులో ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా లేదన్నారు. ఎలాంటి ఎన్నికలు, ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కొట్టుకు పోవడం ఖాయమన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దెబ్బకు కాంగ్రెసు, టిడిపిల కార్యాలయాలు మూతవేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టిడిపి మాజీ నేత ఉప్పులేటి కల్పన వేరుగా అన్నారు. పామర్రులో మాట్లాడిన ఆమె తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పార్టీ పైన కాంగ్రెసు, టిడిపిల విమర్శలకు అర్థం లేదన్నారు. కాంగ్రెసు నుండి టిడిపిలోకి వెళ్లిన చంద్రబాబు పార్టీ మారే నేతల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు ఆకర్షితురాలినైనా తాను జగన్ నాయకత్వంపై నమ్మకంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పామర్రులో సాయంత్రం జరిగే పార్టీ బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారని, వారి సమక్షంలోనే జగన్ పార్టీలో చేరుతున్నట్లు మరో నేత నాగేశ్వర రావు చెప్పారు. వైయస్సార్సీ ప్రభంజనం ధాటికి ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయమన్నారు.

English summary
Krishna district political leader Uppuleti Kalpana lashed out at Telugudesam Party chief Nara Chandrababu Naidu on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X