మనసు మార్చుకున్న రాయపాటి, పోటీకి రెడీ

కాంగ్రెసు పార్టీని వీడి తాను ఎటు వెళ్లబోనని ఆయన చెప్పారు. తన పదవిపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, తనకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ప్రభావితం చేశారనే ఆరోపణలను ఆయన ఖండించారు. షిండేను సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ప్రభావితం చేయలేదని ఆయన చెప్పారు.
తెలంగాణ అంశంపై తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వెల్లడించామని, తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను తెలియజేశామని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల్లో రాయపాటి సాంబశివ రావు కూడా ముఖ్యులు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్ పదవి దక్కకపోవడంతో రాయపాటి సాంబశివ రావు తీవ్ర నిరాశకు గురైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. పదవి రాకపోవడంతో ఆయన అసంతృప్తికి గురై పార్టీ నుంచి తప్పుకోవాలని కూడా ఆలోచన చేసినట్లు చెబుతారు. కానీ, ఆయన ప్రస్తుతం కాంగ్రెసులో కొనసాగాలని, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు ఆయన మాటల ద్వారా తెలిసిపోతోంది.












Click it and Unblock the Notifications