తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తున్నాం: ముఖ్యమంత్రి
యాభై ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం జరుగుతోందని, తెలంగాణ ఉద్యమాన్ని తాము గౌరవిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైందని ఆయన అన్నారు. ఈ అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, ఆందోళనలు చేయవద్దని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం అయ్యే దాకా అభివృద్ధి వద్దా అని ఆయన అడిగారు.
చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని ఆయన అన్నారు. గద్వాల రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. చేనేత వృత్తి ఎలా కొనసాగించాలో ఎవరైనా సూచనలు చేయవచ్చునని, వృత్తిలో సమస్యలను అధిగమించడానికి ప్రిత ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.
అప్పులకు భయపడి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. అప్పులు వ్యక్తిగతంగా తమకు కూడా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా అప్పులున్నాయని ఆయన అన్నారు.