రమ్మన్నదెవరు: రేణుక, కెసిఆర్ విమోచనకు సురేఖ

ఆగస్టులో తెలంగాణ వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పిన మాటలు అబద్దమని తేలిపోయిందని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కనీసం కెసిఆర్కు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా లభించలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, వరంగల్ గీసుకొండలో వైయస్సార్ కాంగ్రెసు దంపతులు కొండా మురళి, సురేఖ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వారు కెసిఆర్ విమోచన దినంగా నిర్వహించారు. దాదాపు ఐదు వేల మందితో కెసిఆర్ శవయాత్ర నిర్వహించారు. కెసిఆర్ తెలంగాణ తీసుకుని వచ్చి గాంధీ అవుతారో, డబ్బులకు అమ్ముడుపోయి తెలంగాణ హీనుడవుతారో ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని వారన్నారు.
ఇప్పటికే కెసిఆర్ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని వారు సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో తెలంగాణ సాధ్యమవుతుందని వారన్నారు. 2014లో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి తెలంగాణ తీసుకుని వస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications