టిడిఎల్పీ బోర్డు తీసిన నాగం: 29న తెలంగాణ.. శంకరన్న
అందుకు నాగం.. తాను లోనికి వస్తానని, కానీ గది ముందు గోడకు ఉన్న టిడిఎల్పీ బోర్డును తీసివేయాలని సూచించారు. కాసేపటి తర్వాత నాగం జనార్ధన్ రెడ్డే ఆ బోర్డు తీసేసి, గది లోపలకు వచ్చి రావులతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత మాజీ మంత్రి శంకర రావుకు నాగం తారసపడ్డారు. శంకరన్న నాగంతో కాసేపు మాట్లాడారు. అనంతరం నాగంను బిజెపి, లోక్సత్తా శాసనసభా పక్ష కార్యాలయాలకు తీసుకు వెళ్లారు.
లోక్సత్తా కార్యాలయంలో జెపితో శంకర రావు మాట్లాడుతూ... నాగం జనార్దన్ రెడ్డి తన క్లాస్ మేట్ అని, చదువుకునే రోజుల నుంచి తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యముందని చెప్పారు. కాగా అంతకుముందు శంకర రావు శాసనసభ లాబీల్లో ఇతర నేతలతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రభుత్వం ఈ నెల 29న కీలక ప్రకటన చేస్తుందని, దీనికి సంబంధించి తన వద్ద పక్కా సమాచారముందని చెప్పారు.
తాను ఎప్పుడూ అబద్దం చెప్పలేదని, వాస్తవం చెబుతున్నానని, 30న తెలంగాణ మార్చ్ నిర్వహించాల్సిన అవసరం రాకపోవచ్చునని, సీమాంధ్ర నేతలతో జాగ్రత్తగా ఉందామని, వారు సమైక్య రాష్ట్రం పేరుతో మాయ చేయడానికి సిద్ధమవుతున్నారని శంకర రావు ఇతర తెలంగాణ ప్రాంత నేతలను హెచ్చరించారు.