హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవుడు చూస్తున్నాడు, ఎమర్జెన్సీ: గాలి జనార్ధన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డిని సోమవారం కర్నాటక నుండి హైదరాబాదుకు ఎసిబి కోర్టుకు తరలించారు. హైదరాబాద్‌కు బయలుదేరేముందు ఆయన బెంగళూర్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ తప్పు చేయని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తనను అరెస్టు చేయడాన్ని చూస్తుంటే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా ఉందని గాలి మండిపడ్డారు. దేవుడు పై నుండి అన్నీ చూస్తున్నాడని, తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.

విజయ రాఘవకు బెయిల్

ఎమ్మార్ కేసులో నిందితుడు విజయ రాఘవకు నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. సిబిఐ విజయ రాఘవను జనవరి 28న ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసింది. ఎమ్మార్ విల్లాల డాక్యుమెంట్లు తారుమారు చేశాడని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు పెట్టుకున్నారు. ఈరోజు ఆయనకు బెయిల్ లభించింది.

ఐఎంజి భారత్ భూ కుంభకోణం కేసులో సిబిఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కేటాయించిన ఐదు భూకేటాయింపులపై గతంలో విచారణ జరిపినట్లు సిబిఐ కోర్టుకు కేసు వివరాలను అందించింది. కోర్టు ఆదేశిస్తే ఇప్పుడు విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిబిఐ తెలిపింది.

English summary
Karnataka Former Minister Gali Janardhan Reddy said on Monday that justice is his side. Vijaya Raghave who is accused in EMAAR case was get bail today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X