బాబు లేఖను లైట్‌గా తీసుకున్న కిరణ్, మార్చ్‌పై తర్జన

Kiran Kumar Reddy
విజయవాడ: తెలంగాణ సమస్యను వెంటనే తేల్చాలని, అఖిల పక్షం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం స్పందించారు. మూడు రోజుల ఇందిర బాట కార్యక్రమంలో ఆయన కృష్ణా జిల్లాలో ఆఖరి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నేతలతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖను తాను తేలిగ్గా తీసుకున్నానని చెప్పారు. బాబు గతంలో రాసిన లేఖకు ఈ లేఖకు తేడా ఏమీ లేదని, అందులో కొత్త ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ని విరమింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కిరణ్ చెప్పారు. ఇదే విషయమై కిరణ్ హైదరాబాదులో ఉన్న తెలంగాణ ప్రాంత మంత్రులతోను, పార్టీ అధిష్టానంతోనూ మాట్లాడారు.

తెలంగాణపై త్వరలో కేంద్రం సరైన నిర్ణయాన్ని వెలువరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజారంజక నిర్ణయం వెలువడేలా చూస్తామన్నారు. మార్చ్ విరమణ కోసం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. చివరి వరకు ప్రయత్నాలు చేసి... కుదరకపోతే రైల్ రోకో తరహాలు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్చ్ పైన అవసరమైతే కఠిన వైఖరి అవలంభించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+