హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

30న శంకరన్న దీక్ష: ఈటెలకు ముఖ్యమంత్రి ఫోన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-P Shankar Rao
హైదరాబాద్: తెలంగాణ కవాతుకు మద్దతుగా, తెలంగాణ మంత్రులకు జరిగిన అవమానానికి నిరసనగా ఈ నెల 30వ తేదీన తాను దీక్ష చేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు పి. శంకరరావు చెప్పారు. తెలంగాణ మంత్రులు వెంటనే మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశమైనప్పుడే అదే విషయంపై డిజీపి మీడియా సమావేశం నిర్వహించడం ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రే డిజిపితో మాట్లాడించారని ఆయన విమర్శించారు. ఇది కచ్చితంగా తెలంగాణ మంత్రులను అవమానించడమేనని అన్నారు. ఇలాగే పదవుల్లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని శంకరరావు అన్నారు.

కాగా, తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌తో మాట్లాడారు. ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటలు జరగవని తెలంగాణకు చెందిన మంత్రులు సంతకాలతో రాతపూర్వకమైన హామీ ఇస్తే తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈటెల రాజేందర్‌తో చెప్పినట్లు సమాచారం.

తెలంగాణ కవాతు ప్రశాంతంగా జరుగుతుందని, ఏ విధమైన హింసాత్మక సంఘటనలు జరగవని అంటున్నారు గానీ ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ముఖ్యమంత్రి అడిగినట్లు సమాచారం. అందుకు తెలంగాణ శాసనసభ్యులు బాధ్యత తీసుకుని రాతపూర్వకమైన హామీ ఇస్తారా అని ఆయన అడిగారు. రాతపూర్వకమైన హామీ ఇస్తేనే తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

English summary
Former Minister P Shankar Rao said that he sit on fast on September 30 in support of Telangana march and in protest of insult meted out to Telangana minister. Meanwhile, CM Kiran kumar Reddy sought letter from Telangana MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X