నేపాల్లో విమానం కూలి 19 మంది దుర్మరణం

లూక్లాకు వెళ్లడానికి బయలుదేరిన విమానం కూలడంతో అందులోని 16 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది మరణించారు. ఆ విమానం సీతా ఎయిర్వేస్కు చెందింది. విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరింది. అది గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే విషాద వార్త వినాల్సి వచ్చింది.
గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దాంతో విమానం కోటేశ్వోర్ ప్రాంతంలోని మనహార నది ఒడ్డుపై కూలిపోయింది. ప్రమాద స్థలం విమానాశ్రయానికి దక్షిణాన రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇటలీకి చెందినవారు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
విమాన సిబ్బందిని కెప్టెన్ బిజయ టండూకర్, కో పైలట్ తకేసి థాపా, ఎయిర్ హోస్టెస్ రాజు శంక్యాగా గుర్తించారు. ప్రయాణికులను గుర్తించాల్సి ఉంది.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications