వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌లో విమానం కూలి 19 మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

19 people killed as private aircraft crashes in Nepal
ఖాట్మండు: విమానం కూలిన ఘటనలో నేపాల్‌లో 19 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో చాలా మంది విదేశీయులే. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలడంతో ఈ ప్రమాదం సంభవించింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది.

లూక్లాకు వెళ్లడానికి బయలుదేరిన విమానం కూలడంతో అందులోని 16 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది మరణించారు. ఆ విమానం సీతా ఎయిర్‌వేస్‌కు చెందింది. విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరింది. అది గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే విషాద వార్త వినాల్సి వచ్చింది.

గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దాంతో విమానం కోటేశ్వోర్ ప్రాంతంలోని మనహార నది ఒడ్డుపై కూలిపోయింది. ప్రమాద స్థలం విమానాశ్రయానికి దక్షిణాన రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇటలీకి చెందినవారు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

విమాన సిబ్బందిని కెప్టెన్ బిజయ టండూకర్, కో పైలట్ తకేసి థాపా, ఎయిర్ హోస్టెస్ రాజు శంక్యాగా గుర్తించారు. ప్రయాణికులను గుర్తించాల్సి ఉంది.

English summary
All 19 people, mostly foreigners, aboard a Dornier aircraft of a private airline were killed today as the plane crashed minutes after taking off from the Tribhuvan International Airport here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X