అనుమతి ఇవ్వడం లేదని రాసివ్వండి: కోదండరామ్

తెలంగాణ మార్చ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ మరోవైపు తెలంగాణ నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేయడం సరికాదని రాజకీయ కోదండరాం అన్నారు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదని ఆయన అన్నారు. తాము కవాతును శాంతియుతంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ ఉదయమే అరెస్టుల విషయంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డిలను కలుసుకుని మాట్లాడామని, కవాతుకు వస్తున్న వారిని అపవద్దని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. తక్షణమే అరెస్టులు నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ మార్చ్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన తర్వాత కూడా అరెస్టులు చేయడం సబబు కాదని అన్నారు.
అరెస్టులను ఆపకపోతే జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధ్యత వహించాలని నారాయణ హెచ్చరించారు. తెలంగాణవ్యాప్తంగా అరెస్టు చేసిన సీపీఐ నేతలను, తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చ్కు అనుమతి ఇచ్చి అరెస్టులు కొనసాగించడం ప్రభుత్వ కుటిల నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అరెస్టులపై మరోసారి హోం మంత్రిని కలుస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications