ఏడాది తర్వాతే, చర్చలతోనే...: తెలంగాణపై టిజి వెంకటేష్

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఆమరణ దీక్ష చేస్తే ఒరిగేదేమీ లేదని మంత్రి అన్నారు. తెలంగాణ సమస్య ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉందని అన్నారు. ఎల్లుండి ప్రతినిధి బృందంతో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు కోస్తాంధ్రకు చెందిన మంత్రి తోట నరసింహం అన్నారు. అయితే తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.
కాగా, తెలంగాణ అంశంపై ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ స్పందించారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి సులువైన మార్గాలు లేవని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఇరు ప్రాంతాలవారు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
తెలంగాణ చాలా సున్నితమైన, భావోద్వేగపరమైన, వివాదాస్పద అంశమని మనీష్ తివారీ అన్నారు. అందువల్ల తెలంగాణపై అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తిరిగి వచ్చిన తర్వాతనే తెలంగాణపై చర్చలు జరిగే అవకాశం ఉందని ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications