ఏడాది తర్వాతే, చర్చలతోనే...: తెలంగాణపై టిజి వెంకటేష్

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఆమరణ దీక్ష చేస్తే ఒరిగేదేమీ లేదని మంత్రి అన్నారు. తెలంగాణ సమస్య ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉందని అన్నారు. ఎల్లుండి ప్రతినిధి బృందంతో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు కోస్తాంధ్రకు చెందిన మంత్రి తోట నరసింహం అన్నారు. అయితే తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.
కాగా, తెలంగాణ అంశంపై ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ స్పందించారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి సులువైన మార్గాలు లేవని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఇరు ప్రాంతాలవారు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
తెలంగాణ చాలా సున్నితమైన, భావోద్వేగపరమైన, వివాదాస్పద అంశమని మనీష్ తివారీ అన్నారు. అందువల్ల తెలంగాణపై అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తిరిగి వచ్చిన తర్వాతనే తెలంగాణపై చర్చలు జరిగే అవకాశం ఉందని ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications