హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందూపురం సెంటిమెంట్: టిడిపి, పాటల సిడి విడుదల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dadi Veerbhadra Rao
హైదరాబాద్: తెలుగువారి ఆత్మ గౌరవాన్ని అధికార కాంగ్రెసు పార్టీ నట్టేట ముంచిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు సోమవారం అన్నారు. అక్టోబర్ 2 నుండి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న వస్తున్నా మీకోసం పాదయాత్రకు సంబంధించిన పాటల సిడిని టిడిపి ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా దాడి వీరభద్ర రావు మాట్లాడారు.

చంద్రబాబు పాలనే బాగుందని అన్ని పార్టీల వారు ఒప్పుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం సమర్థుడైన నాయకుడు కోసం ఎదురు చూస్తోందన్నారు. అందుకే తమ పార్టీ అధినేత పాదయాత్ర తలపెట్టారన్నారు. అనంతపురం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో తొలుత చంద్రబాబు పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి కంభంపాటి రామ్మోహన రావు అన్నారు. హిందూపురం తెలుగుదేశం పార్టీకి సెంటిమెంట్ అని ఆయన తెలిపారు.

బిల్లు పెడితే మద్దతు.. ఎర్రబెల్లి

పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణపై బిల్లు పెడితే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద ధర్నా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. కాగా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ టిడిపి ఫోరం నేతలు భేటీ అయ్యారు. నిన్న జరిగిన తెలంగాణ కవాతు నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలపై చర్చిస్తున్నారు.

English summary

 Telugudesam Party senior leader Kambhampati Rammohan Rao said on Monday that Hindupuram of Anantapur district is sentiment to Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X