హిందూపురం సెంటిమెంట్: టిడిపి, పాటల సిడి విడుదల
చంద్రబాబు పాలనే బాగుందని అన్ని పార్టీల వారు ఒప్పుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం సమర్థుడైన నాయకుడు కోసం ఎదురు చూస్తోందన్నారు. అందుకే తమ పార్టీ అధినేత పాదయాత్ర తలపెట్టారన్నారు. అనంతపురం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో తొలుత చంద్రబాబు పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి కంభంపాటి రామ్మోహన రావు అన్నారు. హిందూపురం తెలుగుదేశం పార్టీకి సెంటిమెంట్ అని ఆయన తెలిపారు.
బిల్లు పెడితే మద్దతు.. ఎర్రబెల్లి
పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణపై బిల్లు పెడితే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద ధర్నా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. కాగా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తెలంగాణ టిడిపి ఫోరం నేతలు భేటీ అయ్యారు. నిన్న జరిగిన తెలంగాణ కవాతు నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలపై చర్చిస్తున్నారు.