చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరి ముందే నిర్మాతను హత్య చేసిన ముఠా

By Pratap
|
Google Oneindia TeluguNews

Tamil Nadu Map
చెన్నై: అందరూ చూస్తుండగానే దాదాపు 20 మందితో కూడిన ముఠా వ్యాపారవేత్త, సినీ నిర్మాతను దారుణంగా హత్య చేసింది. నాటుబాంబులు, మోలోటోవా కాక్‌టెయిల్స్ అతని కారుపైకి విసిరారు. ఆ తర్వాత కత్తులు, తదితర మారణాయుధాలతో అతన్ని నరికి చంపారు. ఈ సంఘటన సోమవారం ఉదయం శ్రీపెరంబుదూర్ సమీపంలో జరిగింది.

దుండగులు 35 ఏళ్ల పిపిజి కుమరన్‌పై శ్రీపెరుంబుదూర్ పట్టణ పంచాయతీ కార్యాలయం ముందు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమరన్ ఇటీవల విడుదలైన తమిళ చిత్రం వైగేయి నిర్మించాడు. పిల్లైపక్కం పట్టణ పంచాయతీ నుంచి ఆయన స్వతంత్రంగా పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించాడు.

కుమరన్ కార్యాలయానికి వెళ్తుండగా ఓ ముఠా కారుకు అడ్డం పడ్డారని, దాంతో డ్రైవర్ కారును ఆపాల్సి వచ్చిందని, హతులు కారుపైకి కనీసం మూడు బాంబులు విసిరారని, కారు తలుపులు బలవంతంగా తీసి కుమరన్‌పై కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారని దర్యాప్తు అధికారులు చెప్పారు. కుమరన్‌కు భద్రత కల్పిస్తున్న ఆయన బంధువు మథి అలియాస్ మథైలగన్‌పై కూడా దుండగులు దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన కుమరన్, శంకర్, మథైలగన్‌లను పోలీసులు తొలుత శ్రీపెరంబుదూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రికి చేర్చారు. అయితే, మార్గమధ్యంలోనే కుమరన్ మరణించారు. మథైలగన్, శంకర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కుమరన్ హత్యకు కారణం రాజకీయ వైరమా, వ్యాపార వైరుధ్యాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A gang of around 20 men killed a businessman-film producer by hurling country-made bombs and Molotov cocktails at his car and hacking him with knives and cleavers in full public view near Sriperumbudur, on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X