చుక్కెదురు: మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిలకు నో బెయిల్

వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు కీలకమైన దశలో ఉందని సిబిఐ అంటూ వారికి బెయిల్ ఇవ్వకూడదని కోర్టును కోరింది. అయితే, తాము రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే వాన్పిక్ వ్యవహారంలో నడుచుకున్నామని, తాము ఏ విధమైన తప్పు చేయలేదని వారిద్దరు చేసిన వాదనను సిబిఐ వ్యతిరేకించింది.
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు అనుకూలంగా వాన్పిక్ వ్యవహారంలో మేలు చేస్తూ వారిద్దరు నిర్ణయాలు తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రిగా వ్యవహరించారు. బ్రహ్మానంద రెడ్డి ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఇదే కేసులో మరో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ న్యాయం, మోపిదేవికి మరో న్యాయమా అని మోపిదేవి తరఫు న్యాయవాది అడిగారు.
వైయస్ జగన్కు సుప్రీంకోర్టు ఇటీవల బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. మరో ఆరు నెలల పాటు బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా నిమ్మగడ్డ ప్రసాద్కు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలను కోర్టు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, వారి రిమాండ్ను ఈ నెల 25వ తేదీ వరకు పొడగించింది.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications