అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబును పట్టుకుంటే గిఫ్ట్, లోకేష్ కోసమే: లక్ష్మీపార్వతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో చేపడుతున్న పాదయాత్ర ప్రజల కోసం కాదని, ఆయన కుమారుడు నారా లోకేష్ కుమార్ కోసమేనని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి మంగళవారం అన్నారు. లోకేష్‌కు రాజకీయ వారసత్వాన్ని అందించే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఈ యాత్ర తలపెట్టారని ఆమె ఆరోపించారు.

అనంతపురం జిల్లాలో రచ్చబండ - పల్లెనిద్ర ముగింపు సందర్భంగా సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి అధ్యక్షతన కుందుర్పిలోని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు టిడిపి పగ్గాలు అప్పగించేందుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు అంగీకరించరని, దీంతో చేసేది లేక చంద్రబాబు పాదయాత్ర ముసుగులో బాధ్యతలు తన తనయుడికి ఇవ్వాలని చూస్తున్నారన్నారు. లొసుగులు అడ్డం పెట్టుకొని చట్టం కళ్లు గప్పి తిరుగుతున్న బాబును పట్టుకుంటే రూ.10 లక్షల బహుమతిని ఇస్తానని ఆమె ప్రకటించారు.

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తన్నాడని, పట్టుకుని కట్టేయమని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. 1994 స్వర్గీయ ఎన్టీఆర్ రాష్ట్రంలో పర్యటించి పార్టీని అధికారంలోకి తీసుకు రాగా ఆరు నెలల్లోనే బాబు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కారని ఆమె నిప్పులు గక్కారు.

English summary
NTR telugudesam Party chief Nandamuri Laxmi Parvathi has offered Rs.10 lakhs to the people, who catch the TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X