శాంతినికేతన్లో మణిపూర్ విద్యార్థినికి వేధింపులు
ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విశ్వవిద్యాలయ స్టాండింగ్ కమిటీ ద్వారా విచారణకు ఆదేశించారు. సిద్దార్థ దేవ్ ముఖోపాధ్యాయ అనే అధ్యాపకుడు విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన విభాగానికి డీన్గా ఉన్నారు. దాంతో ఆయనను విచారణ ముగిసే వరకు ఆ పదవి నుండి తొలగించారు.
బాధితురాలు మణిపూర్ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని అని ఆమె స్వరాష్ట్రానికి వెళ్లి పోయిందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఆమెను ఒప్పించి తిరిగి యూనివర్శిటీకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకుడు తప్పు చేశాడని తేలితే చర్యలు తప్పవన్నారు.
అధ్యాపకుడు విద్యార్థినిని అక్టోబర్ 2వ తేదిన వేధించాడు. ఆ విద్యార్థిని అప్పుడే విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాతే ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.
అసొంలో పడవలు మునిగి ఏడుగురు మృతి
అసోం రాష్ట్రంలోని మోరిగావ్ వద్ద నదిలో రెండు పడవలు మునిగి పోవడంతో ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. మృతులలో ఐదుగురు పాఠశాల విద్యార్థులు ఉన్నారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.