షోరూం ప్రారంభించిన జగన్ ఎమ్మెల్యే, బాబుపై నిప్పులు

ఇంకా చెప్పాలంటే ఆయన అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్న కుమ్మక్కు ఆరోపణల నుండి బయటపడేందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు హయాం నాటి ఐఎంజి కేసుపై మాట్లాడారన్నారు. బాబుపై సిబిఐ దర్యాఫ్తు అని కిరణ్ అనడం కేవలం తమ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని చెప్పేందుకే అని ఆమె విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల్లూ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. చంద్రబాబు పాదయాత్ర తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకే నమ్మకం కలిగిచడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. అంతగా ఆయనపై నమ్మకముంటే ఓ వైపు ఆయన యాత్ర చేస్తుంటే మరోవైపు నేతలు పార్టీని ఎందుకు వీడుతారని ఆమె ప్రశ్నించారు. కాగా శోభా నాగి రెడ్డి కర్నూలులో కళానికేతన్ షోరూం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications