వాన్పిక్ కోసం వైయస్ ప్రత్యేక కార్యదర్శి బెదిరింపులు?

ఒత్తిడి వద్దని ఆయనను కలిసి కూడా వేడుకున్నానని సీనియర్ ఐఏఎస్ అధికారి దేవానంద్ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. దేవానంద్ వాన్పిక్కు భూముల కేటాయింపు సమయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఆయన సిబిఐ ముందు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి తెచ్చినట్లుగా చెప్పారు. భాను తనను తిట్టే వారని దేవానంద్ చెప్పారని సమాచారం.
వాన్పిక్ ప్రాజెక్టులో భాగమైన పారిశ్రామిక కారిడార్కు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 24వేల ఎకరాలను సేకరించాలని, వైయస్ సర్కారు నిర్ణయించడం, రెండు జిల్లాల కలెక్టర్లను ఆ దిశగా పరుగులు పెట్టించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాంగ్మూలంలో కూడా వారు అదే చెప్పారని తెలుస్తోంది.
ఆ జిల్లాల కలెక్టర్లుగా ఉన్న దేవానంద్, వెంకటేషంల వాంగ్మూలాన్ని సిబిఐ సేకరించింది. తాము ఏ స్థాయిలో ఒత్తిళ్లను ఎదుర్కొన్నామో వారు వివరించారు. భాను కీలక పాత్ర పోషించినట్లుగా చెప్పారు. ఓ ప్రయివేటు ప్రాజెక్టు అమలు విషయంలో ఇంత ఒత్తిడి, ఇంత వేగం తాము ఎన్నడూ చూడలేదని వారు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై 2008 జూన్ 29న నిర్వహించిన సమాశంలో దివంగత వైయస్ కూడా ఆదేశాలు జారీ చేశారని, నిర్దిష్ట గడువు పెట్టి వేగంగా పనులు జరిగేలా చూడాలని చెప్పారని దేవానంద్ వివరించినట్లుగా తెలుస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications