ఆశాభోంస్లే కూతురు వర్ష ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
ఈ విషయాన్ని ఆశా తనయుడు ఆనందం పోలీసులకు శనివారం చెప్పారు. ఆనంద్ను పోలీసులు విచారించారు. ఆశా బెల్జియన్ మేక్ 0.6 సెలిబర్ పిస్టల్ను పొగొట్టుకుందని పోలీసులకు తెలిపారు. వర్ష ఏ తుపాకీతో అయితే ప్రభు కుంజ్ రెసిడెన్స్లోని తన నివాసంలో కాల్చుకున్నారో అదే తుపాకీ మిస్ అయిందని అతను చెప్పారు. దీంతో పోలీసులు కొత్త ట్విస్ట్ను ఈ కేసులో ఫేస్ చేస్తున్నారు. ఆనంద్ వాంగ్మూలం పోలీసును గందరగోలపరుస్తోంది.
అయితే ఈ పిస్టల్ ఆనంద్ పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది కూడా వారింట్లో భద్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఆనంద్ ఆ తుపాకీ మిస్ అయిందని చెప్పడంతో పోలీసులకు ఏమీ పాలుపోవట్లేదు. మరోవైపు ఆశా భోంస్లే కూడా ఆ తుపాకీ స్వంతదారు తానేనని, దానిని గతంలో పోగొట్టుకున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. ఆనంద్ తన వాంగ్మూలంలో తనకు సోదరి వర్షతో ఎలాంటి విభేదాలు లేవని, ఇతర అన్నా చెల్లెల్ల వలె తమ మధ్య సాధారణ వాగ్వాదం మాత్రమే ఉండేదని చెప్పారు.
కాగా పోలీసులు అంతకుముందు ఆశా భోంస్లే సోదరి ఉషా మంగేష్కర్, వంటవాడు, డ్రైవర్లను విచారించారు. ఆశా భోంస్లే, ఆమె సోదరి లతా మంగేష్కర్ను కూడా పోలీసులు విచారించారు.