జైల్లో ఉన్నా జనం గురించే, షర్మిల యాత్ర...: భూమన

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం తీర్చకుండా నిరంతరం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మెడలొంచాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఆ పార్టీతో కుమ్మక్కైందని, వైయస్ జగన్కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి భయపడుతున్న టిడిపి అధికారపక్షంతో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టకుండా లాలూచీ పడుతోందని ఆరోపించారు.
ఈ అధికారపక్ష, ప్రతిపక్షాల వైఖరులపై నిరసన తెలపడంతోపాటు, ఇలాంటి సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పేందుకు, భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు పార్టీ తరఫున ప్రజలతో మమేకం కావాలనే భావనతో జగన్ ఉన్నారని, జైల్లో ఉంటూ కూడా జగన్ నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు షర్మిల ఈ యాత్రకు పూనుకున్నారన్నారు. జగన్ నేతృత్వంలో రాబోయే ప్రభుత్వంలో వైయస్ సువర్ణయుగాన్ని మళ్లీ చూడవచ్చన్నారు.
పాదయాత్ర సందర్భంగా వైయస్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చేయొద్దని, పూలు చల్లడంలాంటి కార్యక్రమాలు అసలు వద్దని కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముందుగా రూపొందించిన రూట్మ్యాప్ ప్రకారమే యాత్ర సాగుతుందని, కొద్దిగా కూడా మార్పులుండవని, ఈ విషయం స్థానిక నాయకులు గుర్తించాలని అన్నారు.












Click it and Unblock the Notifications