వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులకు న్యాయసహాయం: వాదన వినిపించుకోండి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రులకు న్యాయ సహాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్వీకరించింది. ప్రభుత్వం జీవోలపై సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను 26 వివాదాస్పద జివోల పిటిషన్‌కు జత చేయాలని సుప్రీం కోర్టు సూచించింది.

ఒడిశాకు చెందిన దేబ్రా అనే వ్యక్తి ప్రభుత్వం మంత్రులకు న్యాయసహాయం అందించాలన్న జివోలపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. సంబంధిత బెంచులోనే మీ వాదన వినిపించాలని పిటిషనర్‌కు సూచించింది. 26 జివోలకు దీనిని జత చేయాలని ఆదేశించింది. గతంలో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది కేసులో ఇంప్లీడ్ కావాలని సూచించింది.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి 26 జివోలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వీటిని జారీ చేసిన ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు.

వీరికి సుప్రీం నుండి నోటీసులు జారీ కావడంతో ప్రభుత్వం న్యాయసహాయం అందించేందుకు జీవోలు జారీ చేసింది. దీనిపై అతను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అంతకుముందు వివాదాస్పద 26 జివోలకు సంబంధించి సంబంధిత మంత్రులను కూడా విచారించాలని సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.

English summary
Supreme Court has uphold Petition Debera's petition on Monday. He filed a petition against legal assistance to ministers in 26 Gos issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X