శంకరరావు లెటర్ హెడ్ చోరీ: అడ్వోకేట్ విచారణ
ఎసిబి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో శ్రీపాద ప్రభాకర రావును పోలీసులు దాదాపు అరగంట పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో తనకు ఆ లెటర్ హెడ్ గురించి తెలియదని ఆయన చెప్పినట్లుగా సమాచారం. కాగా గత నెల 13వ తేదిన మంత్రి శంకరరావు లెటర్ హెడ్ మిస్ అయింది. అతను ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అడ్వోకేట్ ఎత్తుకు వెళ్లాడంటూ శంకరరావు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అతన్ని విచారించేందుకు సిద్ధపడ్డారు. ఈ రోజు పోలీసులు అతనిని విచారించే ముందు అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే పోలీసులు అతనిని అరగంట పాటు విచారించి విడిచిపెట్టారు. ఈ ఫిర్యాదు ఆదివారం చేశారు.
Comments
English summary
Former Minister Shankar Rao has complained in Musheerabad police station that some one stolen his signed letter head.
Story first published: Monday, October 15, 2012, 17:16 [IST]