జగన్ పార్టీకి ముగ్గురుఅధ్యక్షులు, కుటుంబ పార్టీ: టిడిపి

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ముగ్గురు అధ్యక్షులు అని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అధ్యక్షుడుగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలుగా పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారని అన్నారు. అది కుటుంబ పార్టీ అన్నారు. పదవులన్నీ కుటుంబానికే కట్టబెడుతున్నారన్నారు.

అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ కోసమే కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందన్నారు. అందుకే బొగ్గు కుంభకోణంపై, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలపై ఆ పార్టీ మాట్లాడటం లేదన్నారు. బొగ్గు కుంభకోణంలో జగన్ పార్టీకి కూడా పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్‌ల అవినీతి కొనసాగింపే షర్మిల పాదయాత్ర అన్నారు.

జగన్ బెంగళూరు, హైదరాబాదులలో ఇళ్లు, సాక్షి మీడియా, వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రజల నుండి వీటిపై ప్రతిఘటన ఎదుర్కొంటారన్నారు. పాదయాత్రలో ప్రజలకు ఆస్తులపై చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

అవినీతికి లైసెన్స్ కోసమే.. చంద్రబాబు

అనంతపురం: అవినీతికి లైసెన్స్ కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెసును తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు తన వస్తున్నా మీకోసం పాదయాత్రను 16వ రోజు కర్నూలు జిల్లా ఘణపురం నుండి ప్రారంభించారు. ఈ రోజు ఆయన ఆదోని నియోజకవర్గంలో 19.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+