విద్వేషకారులతో కమిటీయా: రాంబాబుపై అడుసుమిల్లి

సెన్సార్ బోర్డు చేయాల్సిన పనిని ప్రభుత్వం వేసిన కమిటీ ఎలా చేస్తుందని ఆయన అడిగారు. కమిటీని నియమించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని ప్రశ్నించారు. సమస్య ఏదైనా ఉంటే సెన్సార్ బోర్డుకు అపీల్ చేసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కమిటీ ఏర్పాటుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అడుసుమిల్లి జయప్రకాష్ విజయవాడ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు సన్నిహితులు. లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే సినిమాకు తన పూర్తి మద్దతు ప్రకటించారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు లేవని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. సినిమాపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆయన విశాఖ విమ్యాక్స్ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని సినిమాను చూశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
సినిమాలో ఎక్కడ కూడా తెలంగాణవాదులను కించపరిచే అంశాలు లేవని ఆయన అన్నారు. దనిపై లేనిపోని రాద్ధాంతం చేయడం సబబు కాదని ఆయన అన్నారు. దర్శక నిర్మాతలు, తెలంగాణ పంపిణీదారుల కార్యాలయాలపై దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గంటా శ్రీనివాస రావు రాజ్యసభ సభ్యుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవికి అత్యంత సన్నిహితులు. ఆయన చిరంజీవితో పాటు ప్రజారాజ్యంలో ఉన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications