హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు గోడమీది పిల్లి: కిషన్‌రెడ్డి, 'బ్రాహ్మనిజం'పై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరి గోడమీది పిల్లి వాటంలా ఉందన్నారు. బాబు తెలంగాణలో పర్యటిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తెలంగాణపై ఆయన వైఖరి చెబితే మంచిదన్నారు.

నాన్చుడు ధోరణితో చంద్రబాబు తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను మోసగిస్తున్నారన్నారు. వుమన్ ఇన్ బ్రాహ్మనిజం సినిమాపై కూడా కిషన్ రెడ్డి మండిపడ్డారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా సినిమాలు తీస్తే ఇక ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సినిమా నిర్మాత, దర్శకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

హిందూ దేవతలపై వ్యంగ్యంగా చిత్రాన్ని తీస్తే ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఏ మతానికి వ్యతిరేకంగా సినిమా తీసినా బిజెపి ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. అన్ని మతాలను గౌరవించాలన్నారు. వుమన్ ఇన్ బ్రాహ్మనిజం వంటి చిత్రాలు రాకుండా ఉండేందుకు తమ పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ విషయంలో కేంద్రమంత్రి చెప్పిన మాటలే వినాలని కిషన్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర మంత్రులు, తెలంగాణ మంత్రులు చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. కేంద్రం తెలంగాణపై నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని, వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు.

English summary

 BJP state president Kishan Reddy lashed out at TDP chief Nara Chandrababu Naidu for his attitude on telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X