50 కోట్ల గర్ల్ ఫ్రెండ్: శశిపై మోడీ సెటైర్స్, సోనియా పైనా
వంట గది ముఖం ఎరుగని మహిళకు గ్యాస్ ధరల పెంపు వల్ల వంటింటి మహిళలు పడుతున్న కష్టాలు ఏమి తెలుస్తాయంటూ సోనియా గాంధీపై విరుచుకు పడ్డారు. ఆదివారం జరిగిన విస్తరణను ఆయన విడిచి పెట్టలేదు. అవినీతి మంత్రికి సల్మాన్ ఖుర్షీద్ ప్రమోషన్ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ కాదు, మౌన్ మోహన్ సింగ్ అంటూ ఎద్దేవా చేశారు. మౌన్ మోహన్ మౌనాన్ని వీడటం అతి పెద్ద వార్త అన్నారు.
ఆయన ఏనాడైనా పెరిగిన నిత్యావసర ధరలపై మాట్లాడారా.. క్షమాపణ చెప్పారా అని ప్రశ్నించారు. క్రికెట్ పేరిట కోట్లు సంపాదించారని ఆరోపణలున్న శశి థరూర్కు మళ్లీ అవకాశం కల్పించారని దుయ్యబట్టారు. కొద్ది రోజుల క్రితం సోనియా మండి వచ్చారని, ప్రధాని కూడా నిన్ననే వచ్చారని, అయితే వారు ధరల పెరుగుదల వండి పేదల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తే సంతోషించే వాడిని అన్నారు.
కాగా రాష్ట్ర వాస్తవిక పరిస్థితిని కళ్లకు కడతామంటూ ఇప్పటికే కాంగ్రెస్పార్టీ మార్పు కోసం చేతులు కలపండి'(జెహెచ్సి) పేరిట సోషల్ నెట్వర్కింగ్ సైట్ను ప్రారంభించింది. దీనికి పోటీగా బీజేపీ '11 ఏళ్ల గుజరాత్ ప్రభుత్వంలో 11 నిజాలు' అనే వెబ్ పేజీని ఆరంభించింది.