వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు లేఖ గురించి తెలియదు: తెలంగాణపై షిండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - ushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణపై ఎవరు సలహాలు ఇచ్చినా తాము స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం అన్నారు. ఆయన న్యూఢిల్లీలో ఐపిఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను తెలంగాణపై ప్రశ్నించింది.

తెలంగాణపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఎప్పటిలోగా చర్చలు పూర్తవుతాయో ఖచ్చితంగా చెప్పలేమన్నారు. పరిష్కార మార్గాలు వెతుకుతున్నామని, సమస్య పరిష్కారమయ్యే వరకు చర్చలు కొనసాగుతాయని చెప్పారు. తెలంగాణపై ఎవరి సలహాలైనా తీసుకుంటామన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ గురించి తనకు తెలియదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తమ పార్టీ పార్లమెంటు సభ్యులు తనను వచ్చి కలిశారని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరారని చెప్పారు. కాగా తెలంగాణపై కేంద్రం ఇటీవల జోరుగా చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Central Home Minister Sushil Kumar Shinde said that he did not know about TDP chif Nara Chandrababu Naidu's letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X