ఎర్రన్నకు అధికారిక అంత్యక్రియలు: బాబు, ఎన్టీఆర్ హాజరు

ఎర్రన్నాయుడు అంతిమయాత్రకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు, ామా నాగేశ్వర రావు, నందమూరి హరికృష్ణ, ఉమ్మారెడ్డి, వల్లభనేని వంశీ, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, మంత్రులు బాలరాజు, శత్రుచర్ల విజయరామ రాజు, హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, బాబు తనయుడు నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.
ఎర్రన్నాయుడి చితికి ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు నిప్పు అంటించారు. విశాఖపట్నంలో ఓ పెళ్లికి హాజరై శ్రీకాకుళం తిరిగి వస్తున్న ఎర్రన్నాయుడు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఎర్రన్నాయుడు మృతికి రాజకీయ ప్రముఖులు అందరూ సంతాపం తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి, గవర్నర్ నరసింహన్ తదతరులు తమ సంతాపం తెలిపి, ఆయనను కొనియాడారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యదర్శిని నిన్ననే ఆదేశించారు. ఈ రోజు ఎర్రన్నాయుడు మృతదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications