ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి లక్ష్మీ పార్వతి: ఎన్టీఆర్ టిడిపికి రిజైన్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
ఏలూరు: తాను త్వరలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి శనివారం చెప్పారు. ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. తాను ఎన్టీఆర్ టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపుతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ టిడిపి అప్పట్లో ఎన్టీఆరే స్థాపించారని చెప్పారు.

ఆయన ఆశయాలను కొనసాగించేందుకే తాను ఈ పదహారు ఏళ్లు కష్టపడ్డానని చెప్పారు. తనను అమ్మ అని అన్నవాళ్లే తనపై ఎన్నో కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తాను ఎన్టీఆర్ మరణం తర్వాత అనే పుస్తకాన్ని రాయబోతున్నట్లు చెప్పారు. తన ఆశయాలు కొనసాగే అనుకూలమైన వేదికగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తాను భావిస్తున్నానని లక్ష్మీ పార్వతి చెప్పారు.

అందుకే ఆ పార్టీలో చేరుతున్నానని అన్నారు. వచ్చే ఎన్నికలలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్టీ ద్వారా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేరుస్తానని చెప్పారు.

కాగా ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలిగా లక్ష్మీ పార్వతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఎదుర్కొనేందుకే ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. చంద్రబాబుపై నిత్యం విమర్శలు చేస్తుంటారు. తాజాగా జగన్ హవా కొనసాగుతుండటంతో ఆమె ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

English summary
NTR TDP president Laxmi Parvathi will join in YSR Congress party soon. She said media in West Godavari that she will resign as president of NTR TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X