వానపడితే కష్టాలు తెలిశాయి: బురదలో షర్మిల నడక

Sharmila
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే రామ రాజ్యం, రాజన్న రాజ్యం సాధ్యమని ఆయన సోదరి షర్మిల శుక్రవారం అన్నారు. ఆమె అనంతపురం జిల్లాలో పదహారో రోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు విత్తనాలకు యాభై శాతం సబ్సిడీ ఉంటే ఇప్పుడు పూర్తిగా తగ్గించేశారని ఆరోపించారు.

సకాలంలో సబ్సిడీ విత్తనాలు అందక రైతులు పంటను ఖాళీగా వదిలేశారని ఆరోపించారు. కరెంటు లేక నీళ్లు లేక రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు. ఇలాంటి అసమర్థ ప్రభుతవంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు.

జగన్‌తో రామరాజ్యం ఖాయమన్నారు. షర్మిల శుక్రవారం ఉదయం 10.15 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. పెన్న అహోబిలం మీదుగా మధ్యాహ్నం 2.15కు కోనాపురం క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. కోనాపురం, పేస్థానిపల్లి మీదుగా రహదారు పూర్తిగా బురదతో ఉంది. ఆమె వర్షంలోనే తడుస్తూ.. బురదలోనే నడిచారు.

వానపడుతోంది కాబట్టి తనకు ఇక్కడి ప్రజలు కష్టాలు అర్థమయ్యాయని, ఈ రోడ్డుపై మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. జగన్ సిఎం అయ్యాక మీకు రోడ్డు, బస్సులు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో షర్మిల తన పాదయాత్రను ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+