ఆదుకుంటాం: వరద బాధితులకు సిఎం భరోసా

మంగళవారం ఉదయం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయడానికై వెళ్తూ గన్నవరం విమానాశ్రమంలో దిగిన ముఖ్యమంత్రి అక్కడి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అర్హులైన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సీడీ ఇస్తామని, కౌలు రైతుల అప్పుల రద్దు విషయం ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బుడమేరుపై హైపవర్ కమిటీ వేశామని దానికి శాస్వత పరిష్కార మార్గం చూపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తర్వాత విమానాశ్రయం నుంచి సీఎం వరద ప్రాంతాల ఏరియల్ సర్వేకు బయలుదేరారు. ఆయన వెంటనే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి ఆలస్యంగా ముఖ్యమంత్రి వరద తాకిడి ప్రాంతాలకు బయలుదేరారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో వాతారవణం అనుకూలించక పోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ కావడం కష్టమైంది.
ఎరియల్ సర్వే కోసం ఉదయమే బయలుదేరిన కిరణ్ వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాశ్రయంలోనే నిరీక్షించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, నేతలు కూడా ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో కూడా ఆయన కోసం పలువురు నేతలు, మంత్రులు ఉన్నారు. వాతారవరణం అనుకూలంగా లేక పోవడంతో కిరణ్ ఎరియల్ సర్వే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం ప్రారంభమయింది.












Click it and Unblock the Notifications