సమాధానం చెప్తాం: తెలంగాణపై నాగంకు కెటిఆర్ కౌంటర్

నాగం జనార్ధన్ రెడ్డి తన భరోసాయాత్రకు మద్దతివ్వాలని కోరుతూ తమను సంప్రదించలేదన్నారు. రేపటి నుండి రెండు రోజుల పాటు కరీంనగర్లో మేధోమథనం నిర్వహిస్తున్నామని, ఇందులో తెలంగాణపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై ఈ సమావేశంలో డిక్లరేషన్ ప్రకటిస్తామని, అన్ని అంశాలపై తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టత ఇస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాపాడటానికి కొందరు ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు పార్టీ పనులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. ఢిల్లీలో ర్యాలీకి పరుగులు తీసిన ప్రభుత్వం నీలం తుఫాను కారణంగా రైతులు అష్టకష్టాల్లో ఉంటే మాత్రం నిద్రపోతున్నట్లుగా ఉందన్నారు. తుఫాను విలయంతో రైతులు సర్వం కోల్పోతే కార్యాచరణకు దిగడానికి బదులు ముఖ్యమంత్రి మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై స్పందించడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కిందట అందాల్సిన పరిహారం రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications