సమాధానం చెప్తాం: తెలంగాణపై నాగంకు కెటిఆర్ కౌంటర్

నాగం జనార్ధన్ రెడ్డి తన భరోసాయాత్రకు మద్దతివ్వాలని కోరుతూ తమను సంప్రదించలేదన్నారు. రేపటి నుండి రెండు రోజుల పాటు కరీంనగర్లో మేధోమథనం నిర్వహిస్తున్నామని, ఇందులో తెలంగాణపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై ఈ సమావేశంలో డిక్లరేషన్ ప్రకటిస్తామని, అన్ని అంశాలపై తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టత ఇస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాపాడటానికి కొందరు ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు పార్టీ పనులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. ఢిల్లీలో ర్యాలీకి పరుగులు తీసిన ప్రభుత్వం నీలం తుఫాను కారణంగా రైతులు అష్టకష్టాల్లో ఉంటే మాత్రం నిద్రపోతున్నట్లుగా ఉందన్నారు. తుఫాను విలయంతో రైతులు సర్వం కోల్పోతే కార్యాచరణకు దిగడానికి బదులు ముఖ్యమంత్రి మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై స్పందించడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కిందట అందాల్సిన పరిహారం రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications