పేలిన కాన్వాయ్ కారు టైరు: సబితకు తప్పిన ప్రమాదం

ఈ ఘటన తుని వెళ్తుండగా ప్రత్తిపాడు సమీపంలో జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖ జిల్లా పర్యటన రద్దయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటన రద్దయింది. కిరణ్ ఈ రోజు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
అంతకుముందు మీడియాతో కిరణ్ మాట్లాడారు. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. బాధితులను తప్పకుండా ఆదుకుంటామని, బుడమేరుపై హైపవర్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు.
ప్రతి రైతు నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పారు. వరదల్లో మరణించిన చలమప్పగూడెంలోని ఇద్దరు మహిళల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్షన్నర రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications